రాత్రి సమయంలో ఆకతాయిగా తిరుగుతున్న వాహనదారులను మంగళగిరి రూరల్ ఎస్సై వెంకట్ హెచ్చరించారు. మంగళగిరి ఎన్నారై వై జంక్షన్ వద్ద రాత్రులు మద్యం సేవించి, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని, అలాగే ఆకతాయిగా తిరుగుతున్న వాహనదారులను, అనుమానస్పదంగా తిరుగుతున్న పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రాత్రులు ఆకతాయిగా తిరిగి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని చెప్పారు.