పొన్నూరు మండలంలో పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

63చూసినవారు
పొన్నూరు మండలంలో పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
పొన్నూరు మండలంలోనీ వెల్లలూరు, గొళ్లమూడిపాడు గ్రామాలలోని పంట పొలాలను మంగళవారం గుంటూరు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ నగేష్, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ కిషోర్ బృందం పరిశీలించారు. పొలాలలోని నీటిని వెంటనే బయటికి పంపి ఎకరాకు బూస్టర్ డోస్ గా 30 కిలోల యూరియా 15 కిలోల మ్యూరేట్ఆఫ్ పొటాషియం చల్లి పంటలను రక్షించుకోవాలనీ రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఏడిఏ రామకోటేశ్వరి ఏవో డేగల వెంకట్రామయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్