ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయం: ధూళిపాళ్ల

55చూసినవారు
ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయం: ధూళిపాళ్ల
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 7వ వార్డు డివిసి కాలనీలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని వంద రోజుల పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. జనసేన నాయకుడు వడ్రాణంమార్కండేయులు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, రెవెన్యూ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్