గుంటూరు జిల్లా పెదకాకాని మండల కేంద్రంలో గురువారం జై భారత్ నేషనల్ పార్టీ పొన్నూరుఅసెంబ్లీ అభ్యర్థి వరికుంట రోశయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలో ప్రజల దగ్గరకు వెళ్లి పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను అందిస్తూ నీతినిజాయితీ, అవినీతి లేని పరిపాలన కోరుకుంటున్న ప్రజలు జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.