రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర బుధవారం సంతమాగులూరు మండలం వెల్లలచెరువుకు చేరుకుంది. అప్పటికే నియోజకవర్గం నలుమూలల నుంచి వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగన్ రాక కోసం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు పది నిమిషాల పాటు కార్యకర్తలతో మాట్లాడి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.