చిలకలూరిపేటలో బస్సులను అడ్డుకున్న నాయకులు

76చూసినవారు
వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెంటనే ఉపసంహరించుకోవాలని చిలకలూరిపేట మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చిలకలూరిపేట లో భారత్ బంద్ నేపథ్యంలో వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అనంతరం రోడ్లపైకి వస్తున్న స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్