ముంపు ప్రాంతాలపై మంత్రి ప్రత్యేక దృష్టి

79చూసినవారు
ఏపీ లో గత మూడు రోజుల నుండి భారీ వర్షాల కారణంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముంపు పరివాహక ప్రాంతాల్లో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇళ్లు నీట మునిగిన బాధితులతో పెమ్మసాని మాట్లాడి అన్నీ విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారులు ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్