గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చిరు వ్యాపారులు ధర్నా

52చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శనివారం చిరు వ్యాపారులు ధర్నా చేపట్టారు. ఆసుపత్రి పరిసరాలలో రోడ్లపై చిరు వ్యాపారాలు చేస్తున్న వారిని ఇటీవల అధికారులు అక్కడ నుంచి వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయా వ్యాపారులు ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆసుపత్రి అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్