మహనీయుల బాటలో నడుద్దాం: పెమ్మసాని

70చూసినవారు
మహనీయుల బాటలో నడుద్దాం: పెమ్మసాని
ప్రతి ఒక్కరూ మహనీయుల బాటలో నడిచి, వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్