పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

65చూసినవారు
పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
పిడుగురాళ్లలోని ఆంధ్రాబ్యాంకు సెంటర్ లో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు సోడాలు వ్యాపారి ఏవూరి సత్యనారాయణ వ్యాపారాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నాడు. రోడ్డు దాటే సమయంలో అటుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి ఎస్ఐ మోహన్ రావు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్