రైలు ఢీకొని ఫార్మసీ విద్యార్థి మృతి
రైలు ఢీకొని ఫార్మసీ విద్యార్థి మృతి చెందిన ఘటన నరసరావుపేట సమీపంలో చోటుచేసుకుంది. నరసారావుపేట ఎస్సై సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం. శనివారం రాత్రి బీఫార్మసీ విద్యార్థి శ్రీకాంత్ రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడిది వెల్దుర్తి మండలంలోని సిరిగిరిపాడు సమీప లోయపల్లిగా గుర్తించి కుటుంబ సభ్యులకు ఆదివారం సమాచారం ఇచ్చారు.