కన్న కూతురును కడతేర్చిన తండ్రి.. కారణం ఏంటంటే
కూతురు నల్లగా పుట్టిందని పసిగుడ్డు గొంతు నులిమి చంపేశాడు ఓ కసాయి తండ్రి. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన యువకుడికి మూడేళ్ల క్రితం బొమ్మరాజుపల్లికి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కూతురు ఉంది. కూతురు నల్లగా ఉండటం ఆ తండ్రికి నచ్చలేదు. దాంతో తల్లి లేని సమయంలో పాప గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పాప ముక్కులో నుంచి రక్తం కారడం చూసిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫలితం దక్కలేదు. భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.