మాచర్ల: ఘనంగా ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభ

51చూసినవారు
మాచర్ల: ఘనంగా ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభ
ప్రొఫెసర్ జి. యన్ సాయిబాబా సంస్మరణ సభను ఆదివారం దాచేపల్లి ఎస్.టి.యు కార్యాలయంలో భారత్ బచావో ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కొవ్వొత్తులతో కామ్రేడ్ సాయిబాబా గారికి శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి జరిగిన సభను ఉద్దేశించి పిడియం నాయకుడు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, ఊపా చట్టం కింద జైళ్ళలో మగ్గుతున్న వేలాది మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్