పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ని మర్యాదపూర్వకంగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ నియోజకవర్గానికి అభివృద్ధికి కృషిలో సహకరిస్తామని శ్రీధర్ తెలిపినట్లు వివరించారు. శ్రీధర్ ను కాకుండా ప్రవీణ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించారు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయము విధితమే.