ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలపై తనిఖీ..

77చూసినవారు
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను కేంద్ర బృందం పరిశీలించారు. ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాలు ఏ ఏ దశలో ఉన్నాయి పెండింగ్ బిల్లులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 26 మందితో కూడిన కేంద్ర బృందం పాల్గొన్నారు.