ప్రభుత్వ వైద్యశాల పరిశీలించిన జడ్పిటిసి సభ్యుడు

58చూసినవారు
నిజాంపట్నం సామాజిక ప్రభుత్వ వైద్యశాలను బుధవారం జడ్పీటీసీ సభ్యులు సర్రా సుబ్బయ్య ఆకస్మికంగా సందర్శించి వైద్యులతో మాట్లాదారు. వైద్యశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా వైద్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా రోజుకు ఓపి ఎంత వస్తుందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యలను మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :