వరి పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి

62చూసినవారు
వరి పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి
పంట నష్టపోయిన రైతులు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు అనుసరించి వరి సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం తెనాలి మండలం కొలకలూరు, హాఫ్‌ పేట, నందివెలుగు, తేలప్రోలు గ్రామాల్లో వెద పద్దతిలో వేసిన వరి పొలాలను పరిశీలించారు. నీట మునిగిన పంటలకు తీసుకోవల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కాల్వల్లో పేరుకుపోయిన చిన్న చిన్న వ్యర్థపదార్థాలను తొలగించుకోవాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్