వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ

67చూసినవారు
వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ
వరద బాధితులను హార్వెస్ట్ ఇండియా ఆదుకోవడం ప్రశంసనీయమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మంగళవారం కొల్లూరు మండలం చింతల్లంక, పెదలంక గ్రామాలలో వరద ముంపుకు గురైన 700 కుటుంబాలకు హార్వెస్ట్ ఇండియా అందజేసిన నిత్యవసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టిన, హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్