ప్రియుడి మోజులో పడి తండ్రిని కూతురే కడతేర్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. ఈరపు దొరస్వామి స్కూల్ టీచర్గా పని చేస్తున్నారు. ఆయనకు 25 ఏళ్ల కూతురు హరిత ఉంది. అయితే కూతురికి నెల కిందట పెళ్లి సంబంధం కుదుర్చారు. ప్రియుడితో ఉండాలనుకున్న హరిత.. తండ్రిని చంపేసింది. నిద్రిస్తున్న సమయంలో ఇనుప వస్తువుతో కొట్టి చంపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.