ఫుట్బాల్ ప్రపంచాన్ని ఊపేసే మహా పోరుకు వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే యూరో కప్.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30 గంటలకు ఆరంభమవనుంది. తొలి మ్యాచ్లో గ్రూప్-ఎలో ఆతిథ్య జర్మనీ.. స్కాట్లాండ్ను ఢీకొననుంది. ఐరోపా ఖండం ఛాంపియన్గా నిలిచేందుకు 24 అత్యుత్తమ జట్టు సమరానికి సై అంటున్నాయి. జూన్ 14 నుంచి జూలై 14 వరకు 10 నగరాల్లో కలిపి మొత్తం 51 మ్యాచ్లు నిర్వహిస్తారు.