పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

74చూసినవారు
పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్‌ స్క్వాడ్స్‌ ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు కమిషనర్‌ జీఎస్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. రష్యన్‌ సర్వర్‌ నుంచి బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చిందని తెలిపారు. వాటిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్