ఏపీలో భూ మాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని కేంద్రమంత్రి అమిత్షా తెలిపారు. "తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడతాం. తెలుగు భాషను రక్షిస్తాం. జగన్ రెడ్డీ గుర్తుంచుకో.. బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వం. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుంది." అని ఆయన హామీ ఇచ్చారు.