దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే చంద్రబాబు తెలిపారు. "మేం అధికారంలోకి వచ్చాక అమరావతిని దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా చేస్తాం. పోలవరం పూర్తి చేసి, హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. జగన్ ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపాల్సిందే. 3 రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారు." అని ధర్మవరం సభలో చంద్రబాబు మండిపడ్డారు.