వైసీపీ మంత్రి రోజాకు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రోజాకు వ్యతిరేకంగా ఉన్న నేతలంతా తాజాగా
టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రోజాకు ఈసారి టికెట్ ఇవ్వవద్దని రోజా వ్యతిరేక సంఘం గట్టిగా డిమాండ్ చేసింది. సీఎం జగన్ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అయితే రోజాకే జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో అసమ్మతి నేతలంతా టీడీపీలో చేరారు. రోజాను చిత్తుగా ఓడిస్తామని ప్రతినబూనారు. ఈ నేపథ్యంలో
వైసీపీ ప్రభంజనంలోనే బొటాబొటీ మెజారిటీతో గెలుపొందిన రోజా ఈసారి గెలుపొందడం అంత ఈజీ కాదని అంటున్నారు.