AP: మాజీ సీఎం వైఎస్ జగన్ను షర్మిల అన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ఇంటి ఆస్తుల వివాదంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. వివేకా హత్య కేసులోనూ జగన్కు ముప్పుతిప్పలు పెడుతున్నారు. వివేకా హత్య కేసులో వైఎస్ సునీతను కూడా చంపుతారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల దూకుడును కంట్రోల్ చేయడానికి వైసీపీ రంగంలోకి రోజాను దింపినట్లు తెలుస్తోంది. జగన్, షర్మిల మధ్యలో ఇప్పుడు రోజా వచ్చారు. షర్మిల దీటుగా రోజా నిలబడినట్లు సమాచారం.