ఎంపీ సమక్షంలో మాజీ కౌన్సిలర్ వెంకటసుబ్బయ్య వైసీపీలో చేరిక

583చూసినవారు
ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఆదిత్య రెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మల సమక్షంలో మాజీ కౌన్సిలర్ తుమ్మిశెట్టి వెంకట సుబ్బయ్యతో పాటు 35 కుటుంబాలు శనివారం బద్వేల్ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆమేరకు ఎంపీ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కరెంటు రమణారెడ్డి, సింగసాని స్వామి గురు మోహన్, వాకమల రాజగోపాల్ రెడ్డి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్