మైలవరం మండలంలోని వద్దిరాల గ్రామంలో వెలసిన సుంకులాంబ తల్లి తిరుణాల మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ప్రజలతోపాటు అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర జిల్లాల నుంచి భక్తుల తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వహణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.