కమలాపురంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్ లో
క్రికెట్, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. స్థానిక గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఎంపీడీవో జ్యోతి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహాదారు సంబటూరు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.