మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న గ్రామస్థులు

78చూసినవారు
వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరు సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఓ కాంటాక్టు కంపెనీ టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా రోడ్డు పనులకు భారీ యంత్రాలతో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. మట్టి తరలిస్తే పశువులకు మేత ఉండదని పాడి రైతులు ఇబ్బందులు పడతారని అన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్