వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ (85) బుధవారం కన్నుమూశారు. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల క్రితం జగన్ పరామర్శించారు. ఆమె మృతితో వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈమె దివంగత వైఎస్ ఆర్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆమె అంత్య క్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.