పాస్టర్ ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదని, ఘటన స్థలంలో హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త కోలా ప్రసాద్ గురువారం ఆరోపించారు. పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలున్నాయన్నారు. మృతి పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని గురువారం కోరారు. మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు వివరించారు.