రాములవారి ఊరేగింపులో విషాదం

2630చూసినవారు
జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లెలో విద్యుత్ తీగలు తగిలి చంద్రఓబుల్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. బుధవారం జరిగిన స్వామి వారి ఊరేగింపులో ఇనుముతో చేసిన హనుమంతుడి విగ్రహానికి పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్