రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి బుక్కే విశ్వనాథ నాయక్ గెలవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ఉదయం నామినేషన్ సందర్భంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి సమద్ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బిజెపి, వైసీపీ ప్రభుత్వాల వల్ల ప్రజలు విసిగిపోయారన్నారు.