మాసాపేటలో వినాయకునికి పూజలు చేసిన మంత్రి మండిపల్లి

84చూసినవారు
మాసాపేటలో వినాయకునికి పూజలు చేసిన మంత్రి మండిపల్లి
వినాయక చవితి సందర్భంగా రాయచోటి పట్టణంలోని మాసాపేట మూడవ వీధిలో ఏర్పాటు చేసిన వినాయకునికి శనివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రివర్యులను కలిసేందుకు మాసాపేట ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వినాయకుని నిమజ్జనం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్