వడ్డెరలు ఐక్యతను చాటుకోవాలి
వడ్డెరలు ఐక్యతను చాటుకోవాలని కలిసికట్టుగా వడ్డెరల అభివృద్ధికి కృషి చేయాలని వడ్డెర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సుండుపల్లి మండలంలోని చెరుకువాండ్ల పల్లె, రాచoవాండ్ల పల్లెలో గ్రామస్తులతో కలిసి ఆయన మాట్లాడారు. వడ్డెరల ఐక్యత కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, మేము చేస్తున్న పోరాటానికి వడ్డెరలు మద్దతుగా నిలవాలన్నారు.