నా రాజకీయ ప్రస్థానంలో మల్లిశాల నాకెప్పుడూ అండగా ఉంది
![నా రాజకీయ ప్రస్థానంలో మల్లిశాల నాకెప్పుడూ అండగా ఉంది](https://media.getlokalapp.com/cache/b7/93/b7934a387daadda4575d27467b228105.webp)
జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆదివారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూల వర్షంతో జననీరాజనాలతో మహిళల మంగళ హారతులతో గ్రామమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం 1981 లో ప్రారంభమైందని అప్పటినుంచి మల్లిశాల గ్రామంలో అందరూ అండగా ఉన్నారన్నారు.