వచ్చే నెల 15 నుంచి బిజెపి ప్రజా దర్బార్

84చూసినవారు
వచ్చే నెల 15 నుంచి బిజెపి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు బిజెపి కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటలనుంచి 10 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్