వచ్చే నెల 15 నుంచి బిజెపి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు బిజెపి కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటలనుంచి 10 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.