రైతులకు రూ.25వేలు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

57చూసినవారు
ఏలేరు వరద నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పెద్దాపురంలో గురువారం పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. పంటలను కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. జగన్ హయాంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు.

సంబంధిత పోస్ట్