అదుపు తప్పిన బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

64చూసినవారు
అనపర్తి రైల్వే పై వంతనపై ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు శుక్రవారం అదుపు తప్పింది. మండపేట నుంచి అనపర్తికి విద్యార్థులను తీసుకొస్తున్న సమయంలో స్టీరింగ్ రాడ్ వదిలేయడంతో అదుపుతప్పి రైల్వే పై వంతెన రైలింగ్ ను ఢీకొంది. ఆ సమయంలో బస్సులో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. అయితే అందరు సురక్షితంగా ఉండటంతో గ్రామస్తులు పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్