ద్వారక తిరుమల: సింహవాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లు

58చూసినవారు
ద్వారకాతిరుమలలో సింహవాహనంపై అలివేలుమంగ ఆండాళ్ అమ్మవార్ల సమేతంగా కొలువైన ఆ దేవదేవుడు గురువారం ఉదయం క్షేత్ర తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణములో మూర్తులను సింహవాహనంపై ఉంచి, అర్చకులు పూలతో అలంకరించారు. యోగమూర్తిగా అభయహస్తాన్ని ఇస్తూ ఉన్న శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అట్టహాసంగా తిరువీదులకు తరలివెళ్లిన స్వామి, అమ్మవార్లను భక్తులు కొలిచారు.

సంబంధిత పోస్ట్