కాకినాడ: సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

82చూసినవారు
కాకినాడ: సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి
డయల్‌ యువర్‌ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 9. 30 నుంచి 10. 30 గంటల వరకు నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి సుమారు తొమ్మిది మంది ఫోన్‌ చేసి తమ సమస్యలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

సంబంధిత పోస్ట్