సమాజంలో గురువుల పాత్ర అద్వితీయమైనది

72చూసినవారు
సమాజంలో గురువుల పాత్ర అద్వితీయమైనది
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో బుధవారం రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు ఉపాధ్యాయులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్