బిజెపి యువమోర్చా కొవ్వొత్తుల ర్యాలీ

58చూసినవారు
హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండపేట యువ మోర్చా ఆధ్వర్యంలో విభజన విభిషిక స్మృతి దివస్ ను జరుపుకున్నారు. 1947 దేశ విభజన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు ఊచ కోతకు గురవ్వడంతో వారందరికీ నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండపేట రధం సెంటర్ నుంచి బస్సు స్టాండ్ వరకు సాగిన ఈ మౌన ర్యాలీలో మండపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్