ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

78చూసినవారు
ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐపోలవరం లో ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శనీయమని పి. టీ. ఎం అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ బి. వీర్రాజు, ఆర్ బాబి, డి నారాయణరావు, జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్