ఐ. పోలవరం: భక్తులకు శుభవార్త.. ఉచిత ఆటో సౌకర్యం

83చూసినవారు
ఐ. పోలవరం: భక్తులకు శుభవార్త.. ఉచిత ఆటో సౌకర్యం
ఐ. పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య కళ్యాణం రాత్రి సమయంలో జరగడం విశేషం. ఇతర జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి బస్సులో వచ్చి కళ్యాణంలో పాల్గొంటారు. రాత్రి సమయంలో రవాణా సదుపాయం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత ఆటో సౌకర్యం ఏర్పాటు చేశామని ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్