
ప్రతిపాడు: జనసేన పార్టీలో చేరికలు
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు శనివారం గుంటూరు జిల్లా కార్యాలయంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గాదే మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని, నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు.