నిబంధనల ప్రకారం ఉత్సవాలు నిర్వహించాలి: ఎస్పీ

66చూసినవారు
నిబంధనల ప్రకారం ఉత్సవాలు నిర్వహించాలి: ఎస్పీ
వినాయక నిమజ్జన ఉత్సవాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని తూ. గో ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పండుగను ఆహ్లాదకర వాతావరణంలో, సంతోషాలతో నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్