గుడివాడ నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటన

79చూసినవారు
గుడివాడ నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటన
గుడివాడ నియోజకవర్గంలో సంభవించిన అధిక వర్షాలు, వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానున్నదని, అందుకు వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 11వ తేదీ బుధవారం నందివాడ, గుడివాడ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేంద్ర బృందం పర్యటిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్