
జగ్గయ్యపేట: కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
భవన మరియు ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని జగ్గయ్యపేట సిపిఐ, ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట తహసిల్దార్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం తహసిల్దార్ మనోహర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.