ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి: మంత్రి

82చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రి పి. నారాయణ ఆదేశించారు. మంగళవారం మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్