కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గురువారం టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు పత్రిక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలను దగా చేసే వైసిపి నాయకులను ఓటు ద్వారా ఇంటికి పంపివేయాలని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం లో బోడే ప్రసాద్ మంచి వ్యక్తి అని ఆయన్ని వినిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు.